Thursday, 30 July 2026 04:33:08 PM

మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ...

Date : 25 January 2025 06:40 AM Views : 322

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అమరావతి : ఈ నెలాఖరుకు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఫిబ్రవరి రెండో వారంలో రాజధాని పనులు ప్రారంభిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. న్యాయపర ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందని, ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచామని వెల్లడించారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు.బడుగు బలహీనర్గాల ఆశాజ్యోతి, మరణం ఎదురేగినా వెన్ను చూపని వీరుడు, పేదల హక్కుల కోసం పోరాడిన యోధుడు,ప్రజల గుండెల్లో అస్తమించని రవిగా కొలువు దీరిన పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి మంత్రి నారాయణ ఘన నివాళులర్పించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :