Thursday, 30 July 2026 11:01:34 AM

అడుగడుగునా యువనేతకు నీరాజనాలు...

Date : 14 December 2023 06:28 PM Views : 314

ఆకాంక్ష న్యూస్ - ఆంధ్ర ప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర యలమంచిలికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని వీధులన్నీ టీడీపీ కార్యకర్తలతో కిటకిటలాడాయి. ప్రధాన రహదారి, రోడ్లకు ఇరువైపులా జనం బారులు తీరారు. అడుగడుగునా యువనేతకు నీరాజనాలు పడుతూ మహిళలు సంఘీభావం తెలిపారు. కాగా.. పన్నులపోటు, పెరిగిన ధరలతో బతుకుబండి లాగలేకపోతున్నామని మహిళల ఆవేదన వ్యక్తం చేస్తూ యువనేతకు తమగోడును వెలిబుచ్చారు. మరో 3నెలల్లో చంద్రబాబు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం పన్నులతోపాటు ధరలను అదుపుచేసి ఉపశమనం కలిగిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :