Thursday, 30 July 2026 11:38:20 AM

నలుగురికి ఖేల్రత్న అవార్డులు…

Date : 02 January 2025 09:07 PM Views : 428

ఆకాంక్ష న్యూస్ - న్యూఢిల్లీ / ఆకాంక్ష డెస్క్ : భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం నలుగురు క్రీడాకారులకు ఖేల్రత్న అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత గుకేష్, షూటింగ్ లో ఒలింపిక్స్ పతక విజేత మను భాకర్, హాకీ క్రీడాకారుడు హార్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రధానం చేయనుంది. ఖేల్‌రత్న అవార్డుతోపాటు అర్జున అవార్డులు కూడా ప్రకటించింది కేంద్రం. 17 మంది పారాఅథ్లెట్లతో సహా మొత్తం 32 మంది ఉత్తమ క్రీడాకారులకు అర్జున అవార్డులను కేంద్ర సర్కార్ వెల్లడించింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :