Saturday, 01 August 2026 02:20:05 AM

బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి వచ్చి తిరిగిరాని లోకాలకు...

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి... కూతురుకు తీవ్ర గాయాలు..

Date : 16 February 2025 05:56 PM Views : 569

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కామారెడ్డి జిల్లా : బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజమాబాద్ జిల్లా కుకునూర్ గ్రామానికి చెందిన గంగాధర అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి వచ్చి హైదరాబాద్‌ కు చేరుకున్నాడు.అయితే తన కుమార్తె హాస్టల్‌ లో ఉంటూ చదువుకుంటు ఉండటంతో ఇద్దరు కలిసి స్వగ్రామానికి కారులో బయల్దేరుతుండగా మార్గ మధ్యలో కారు ప్రమాదానికి గురై లారీకి, బస్సుకు మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో గంగాధర మృతి చెందగా, ఆయన కుమార్తె లహరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :