Friday, 31 July 2026 10:32:16 PM

ఏన్టీపీసీలో కార్మికుడి హత్య....

Date : 31 July 2025 12:23 PM Views : 977

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా ఏన్టీపీసీలోని పర్మినెంట్ టౌన్ షిప్ లో ఇద్దరి మధ్య డబ్బుల కోసం జరిగిన ఘర్షణలో తీవ్ర గాయలతో ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మహారాష్ట్ర చంద్రాపూర్ కు చెందిన వినోద్ సోనస్కర్ కు మరో తోటి కార్మికుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పక్కనే ఉన్న రాడ్ తో తోటి కార్మికుడు దాడి చేయడంతో తీవ్ర గాయలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏన్టీపీసీలో భావన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :