Sunday, 26 April 2026 06:43:37 PM

ఇచ్చిన హామీలు నేరవెర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ...

కేసీఆర్‌ని నిందించడం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు... మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Date : 31 December 2024 03:33 PM Views : 637

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవెర్చకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే,పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం ఆయన మాట్లాడారు... కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సంవత్సర కాలంగా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో మహిళలకు రూ.2500, వృద్దులకు 4 వేల ఫించన్ రైతు భరోసా రైతు బంధు విద్యార్థులు స్కూటీలు తదితర హామీలు 2025వ సంవత్సరంలోనైనా అమలు చేయాలనీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ పక్షానా పోరాడుతామని హెచ్చరించారు.రామగుండం ప్రజలందరి ఆశీర్వాదంతో 2018లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2 సంవత్సరాల పాటు కారోనా మహమ్మరి ప్రజల జీవితాలను అతలకుతలం చేసిందని గుర్తుచేశారు.ఆ సందర్భంలో ప్రజలందరికీ అండగా నిలిచామన్నారు. అనాడు పెద ప్రజలు ఆసుపత్రికి వెల్దామన్నా సౌకర్యాలు లేవు.. కాలుష్యానికి నిలయంగా ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి కార్పోరేట్ స్థాయి వైద్యం అందాలన్నా సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని మెప్పించి ఓప్పించి ఈ ప్రాంతానికి సింగరేణి సంస్థ ద్వారా 510 కోట్లతో సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ వైద్య కళాశాలను, నర్సింగ్ కళాశాలను తన 5 ఎళ్ల కాలంలో విజయవంతంగా ఏర్పాటు చేయించామన్నారు.మెడికల్ కళాశాల నర్సింగ్ కళాశాల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ రాష్టాన్ని దేశానికే దిక్సూచి చేయాలని కేసీఆర్‌ 10 ఎళ్ల శ్రమించారన్నారు. దేశంలో ఎక్కుడ లేని రైతు సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేసింది బీఆర్ఎస్ పార్టీ తొలి సిఎం కేసీఆర్‌ అని కొనియాడారు.అభివృద్ధి సంక్షేమ చెస్తాం మార్పు తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంగా ఇచ్చిన హామిలను నెరవెర్చాకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఎళ్ల పాటు అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకువేళ్లినా తొలి సిఎం కేసీఆర్‌ని కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం వారిపై నిలపనిందాలు వేస్తు మాటాలు మాట్లాడుతూ కాలం గడిపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేఖరుల సమావేశం లో కార్పోరేటర్లు బాదె అంజలి కల్వచర్ల కృష్ణ వేణీ జనగామ కవిత సరోజినీ కుమ్మరి శ్రీనివాస్ గాధం విజయ నాయకులు అచ్చే వేణు చెలకలపల్లి శ్రీనివాస్ నారాయణదాసు మారుతి సట్టు శ్రీనివాస్ పిల్లి రమెష్ మెతుకు దేవరాజ్ ఇరుగురాళ్ల శ్రావన్ నిట్టూరి రాజు ముద్దసాని సంధ్యా రెడ్డి ఆవునూరి వెంకటేష్ బొబ్బిలి సతీశ్ వెంకన్న కొడి రామకృష్ణ అల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :