Friday, 31 July 2026 06:34:19 PM

నిబంధనల ఉల్లంఘనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం...

ఓదెలలో స్కూల్ బస్సుల తనిఖీ చేసిన ఎస్ఐ దీకొండ రమేష్....

Date : 31 July 2025 07:34 PM Views : 532

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ఓదెల(పెద్దపల్లి జిల్లా) : పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండల కేంద్రంలో స్కూల్ బస్సుల తనిఖీలు నిర్వహించిన పోత్కపల్లి ఎస్‌ఐ దీకొండ రమేష్ డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా బస్సుల ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి కీలక పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు.ఈ సందర్భంగా ఎస్ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ... విద్యార్థులను తీసుకెళ్లే బస్సులను తప్పనిసరిగా శ్రమయోగ్యమైన స్థితిలో ఉంచాలని, డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలన్నారు. అటెండర్ లేని బస్సులు, ఇన్సూరెన్స్ లేకపోవడం, అనుమతులు లేకుండా నడపడం వంటి ఉల్లంఘనలపై కేసులు నమోదు చేస్తామన్నారు.పాఠశాల బస్సుల్లో విద్యార్థుల సంఖ్య పరిమితికి మించకూడదని, మద్యం సేవించి వాహనం నడిపే డ్రైవర్లపై తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :