ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రజాస్వామిక పాలనకై ఆరు గ్యారెంటీ ల ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ సుందరయ్య పార్క్ నుండి ఇంద్ర పార్క్ వద్ద మహాధర్నా కు పెద్దపల్లి జిల్లా నుండి న్యూ డెమోక్రసీ పార్టీ సభ్యులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి ఈ. నరేష్. మాట్లాడుతూ... రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేని దుస్థితిలో ఉందని మండిపడ్డారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మహిళలకు రూ.2500,వంటగ్యాస్ రూ.500 రైతులకు రైతుబంధు అమలు చేయాలని కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వాలని వృద్ధులకు రూ 4, పింఛన్లు అమలు చేయాలని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జరిగే ధర్నా ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఏ వెంకన్న, బి అశోక్, చిలుక శంకర్, ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, కొల్లూరి మల్లేష్, మెరుగు చంద్రయ్య, ఈ రాజేందర్,డి బుచ్చయ్య ,బ్రతుకుల రాజన్న, డి బుచ్చమ్మ, కె మొగిలి, ఆర్ రాయమల్లు, టీ రాజేష్, బండ పద్మ, శారద ,మేరీ, సుధాకర్, రాజనర్సు, రవి, సత్యం ,ఎడ్ల రవికుమార్, ఎన్ రాజేందర్, కే ఎల్లయ్య, సమ్మక్క,గుండు రాజన్న,వీ. రాజనర్స్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Aakanksha News