ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ముత్తారం : రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, అడవీ శ్రీరాంపూర్ మాజీ ఎంపీటీసీ దొడ్డ గీతారాణి హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో టి ఫైబర్ ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ పైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో మూడు గ్రామాలను ఎంపిక చేయగా, అందులో ముత్తారం మండలంలోని అడవీ శ్రీరాంపూర్ కూడా ఉండటంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువా కప్పి గ్రామ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలని మంత్రిని కోరినట్లు వారు తెలిపారు.
Admin
Aakanksha News