ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చుట్టూ పరిసర ప్రాంతాలు వేడెక్కాయి. అయితే హైడ్రాపై బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. అలాగే తెలంగాణ భవన్ కార్యాలయంలోకి చోచ్చుకవచ్చేందుకు ప్రయత్నాలు చేయగా అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు ఒక్కరిపై మరొక్కరు దాడులు చేసుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాపై పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే..
Admin
Aakanksha News