ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రభుత్వం కుట్ర పూరితంగా కులగణన సర్వే చేసిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. హైదరాబాద్ సహా గ్రామాల్లో కూడా సర్వే సరిగ్గా జరగలేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు ప్రచారంపై తలసాని తీవ్రంగా స్పందించారు. ఈ సందరర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పార్టీ మారిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని అన్నారు. ప్రస్తుతం బిఆర్ఎస్ చాలా హుషారుగా ఉందని యాదవ్ తెలిపారు.
Admin
Aakanksha News