Friday, 31 July 2026 07:42:42 PM

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు అనుమతి ఎవరు ఇచ్చారు...?

ఎస్సై తీరుపై గోదావరిఖని సీత నగర్ లో స్థానికులు ఆందోళన...

Date : 20 June 2023 11:59 PM Views : 2218

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం కమీషనరేట్ పరిధిలోని ఓ ఎస్సై కిరణా షాపు నిర్వాహకుడిని చితక బాదాడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖని సీతనగర్ కూరగాయల మార్కెట్ వద్ద అర్థరాత్రి వరకు షాపును తీశారని సదురు షాప్ నిర్వాహకుడిని ఓ ఎస్ఐ తన లాఠీతో చితకబాదారు. దీంతో షాపు నిర్వాహకుడి చేయి విరిగింది. అయితే అక్కడే ఉన్న స్థానికులు సదరు ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఎలా చితక బాధరంటు నిలదీశారు.అయితే గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఉన్న ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రతిరోజు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి వరకు నడుస్తున్న దీనిపై సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం పట్ల ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చితక షాపుల మీద ప్రభావం చూపించే అధికారులు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొంతమంది షాపు నిర్వాహకులకు తోత్తుల వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :