Thursday, 30 July 2026 05:23:34 PM

కాన్వాయ్ పై బ్లాక్ బెలూన్ విసిరిన బిజెపి నాయకురాలు..

Date : 08 May 2023 08:42 PM Views : 4277

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై ఓ మహిళ బ్లాక్ బెలూన్లు విసిరింది. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బహిరంగ సభ ముగించుకొని తిరిగి వెళుతున్న సమయంలో తన కారులో వచ్చిన బిజెపి నాయకురాలు ఏకంగా పరుగులు తీస్తూ కేటీఆర్ కాన్వాయ్ పై బెలూన్ విసిరింది. కమాన్‌పూర్ మండలానికి చెందిన జనగామ సుజశ్రీ అనే బిజెపి మహిళా మోర్చా నాయకురాలు మంత్రి కేటీఆర్ పర్యటనను నిరసిస్తూ నల్ల బెలూన్లు విసిరినట్లు తెలుస్తుంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులను అరెస్ట్ చేయడం పట్ల అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :