ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. మొదటి అంతస్తులో విద్యుత్ వైర్లు కాలడంతోనే ప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం హోటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అదే హోటల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేస్తున్నట్లు తెలుస్తోంది. మంటల ధాటికి పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలముకున్నాయి. దీంతో హోటల్లో అలజడి చెలరేగింది. టూరిస్టులు, సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.
Admin
Aakanksha News