Saturday, 13 June 2026 02:27:49 PM

ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వండి...

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కోరిన తీన్మార్ మల్లన్న

Date : 17 March 2025 04:33 PM Views : 681

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావును ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నేత‌ల‌తో తీన్మార్ మ‌ల్ల‌న్న బీసీ బిల్లుపై చ‌ర్చించారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్దత కల్పించేలా ఢిల్లీ వేదికగా తాము చేయబోయే ధర్నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ నేత‌ల‌ను తీన్మార్ మల్లన్న కోరారు.ఈ సంద‌ర్భంగా తీన్మార్ మ‌ల్ల‌న్న మాట్లాడుతూ.. ప్రభుత్వం బీసీ బిల్లు తేవటం కాదు. అవసరం అయితే కేంద్రంలో ఆమోదం కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని సీఎంకు డిమాండ్ చేస్తున్నాం. మీ సహకారం కావాలని మ‌ల్ల‌న్న కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :