ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ 2025 వ సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి వారి జీవితాల్లో జీవితాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని కోరారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్ట సుఖాలను సమానంగా స్వీకరించే ధైర్యాన్ని, శక్తిని ప్రజలు అలవర్చుకోవాలని సూచించారు. ప్రజల్లో మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.
Admin
Aakanksha News