ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : పూణె – బెంగళూరు నేషనల్ హైవేపై ఉన్న నావల్ బ్రిడ్జ్పై వేగంగా దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్ పలు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 48 కార్లు దెబ్బతిన్నాయి. వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో భారీగా డ్యామేజ్ జరిగింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ప్రమాదంలో ట్యాంకర్ నుంచి ఆయిల్ కిందపడటంతో వాహనాలు గ్రిప్ మిస్ అయ్యి ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం కారణంగా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Admin
Aakanksha News