ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నిర్మల్ జిల్లా : చదువుల తల్లి సరస్వతిని దర్శించుకునేందుకు నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు కుటుంబ సమేతంగా బాసరకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. దీంతో అక్షరాభ్యాసం కోసం తీసుకొచ్చిన చిన్నారులతో ఆలయం ప్రాంగణంలో సందడి నెలకొంది.
Admin
Aakanksha News