Thursday, 30 July 2026 07:08:24 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా ఇమేజ్ దెబ్బ తీశారు : అల్లు అర్జున్

Date : 26 December 2024 07:01 PM Views : 741

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అల్లు అర్జున్ తన ఇంటి పరువును, ప్రతిష్టను భంగపరిచే విధంగా చెడుగా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసారు సినీ నటుడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో నేను బాధ్యత లేకుండా వ్యవహరించానని అసెంబ్లీలో సిఎం ప్రకటన చేశారు. మళ్లీ ఈ విషయం లేవనెత్తింది. ఈ సంఘటనలో నా తప్పు లేదని ఆయన అన్నారు. నాపై ఈ అపవాదు మోపడం ఏ మాత్రం సరైనది కాదని తెలిపారు. నగర పోలీసు కమిషనర్ సిపి ఆనంద్ ఖండిస్తూ, ఆదివారం ఈ వీడియో సంచలనంగా మారిందని, ఈ వీడియో మీడియాకు విడుదల చేశారు.చట్టం, న్యాయం ముందు అందరూ సమానమేనని కరీంనగర్ పర్యటనకు వెళ్లిన డిజిపి జితేందర్ కూడా ఈ విషయంపై స్పందించారు.సినిమా హీరో అయినంత మాత్రాన తను మామూలు మనిషే, ఒక పౌరుడే. అని మర్చిపోవద్దు అని ఆయన అన్నారు. అలా అయితే సిఎం రేవంత్ రెడ్డి కూడా చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. తను చెప్పిన దానినే వ్యతిరేకిస్తారా? కోమటిరెడ్డి అల్లు అర్జున్ క్షమాపన చెప్పాలని మండిపడ్డారు. సినిమాకి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమేనని వారే అసలు ముద్దాయని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ విరుద్ధంగా స్పందించారు. వీరితో పాటు బండిసంజయ్ తెలుగు ఇండస్ట్రీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారని ఆయన విమర్శించారు. అల్లు అర్జున్ పై జరిగిన సంఘటనకు సిఎం వ్యవహరించే తీరు కరెక్టు కాదని ఎంఐఎం నాయకులతో కలిసి టార్గెట్ చేశారని ఆరోపణ చేశారు. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసే ఆరోపణను తీవ్రంగా ఖండించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :