ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఓటమిపాలైన అనంతరం తొలిసారిగా జనంలోకి వస్తున్నారు. నల్గొండలోని మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద 50 ఎకరాలలో రైతు గర్జన పేరుతో మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సు ద్వారా సభ స్థలికి చేరుకొనున్నారు
Admin
Aakanksha News