ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : బిసిల గురించి మాట్లాడే నైతిక హక్కు బిఆర్ఎస్ కు లేదని టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మహేష్కుమార్గౌడ్ రీ కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ పదేళ్ల పాలనలో బిసిలను అణగదొక్కి అగ్రవర్ణాలకే అంకితమయ్యారని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ నేతల మాటలను ప్రజలు నమ్మరన్నారు. బిసిలకే కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, తన లాంటి సామాన్య కార్యకర్తకు పిసిపి ఇవ్వడంతో పాటు బిసిల డిపార్ట్మెంట్కు అత్యధిక నిధులు ఇచ్చిందని ప్రశంసించారు.
Admin
Aakanksha News