Friday, 31 July 2026 04:23:21 PM

తెలంగాణ ఉద్యోగ, పెన్షనర్స్ కు వెంటనే డిఏ,డిఅర్ లను ప్రకిటించాలి"

Date : 23 January 2024 05:24 PM Views : 461

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ జాయింట్ స్ట్రగుల్ కమిటీ పక్షాన నేడు ప్రతినిధి బృందం ,ఐటి శాఖా మంత్రి శ్రీ శ్రీధర్ బాబునీ కలిసి సన్మానించి,వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను రాబట్టడంలో విజయం సాధించిన సందర్భంగా అభినందనలు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, పెన్షనర్లకు బకాయి పడ్డ 3 డిఏ,డిఅర్ లను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణా జాయింట్ స్ట్రగుల్ కమిటీ చైర్మన్ తిరువరంగం ప్రభాకర్,సెక్రెటరీ రవీందర్ రెడ్డి, మునిసిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు తాజ్మోహన్ రెడ్డి, ప్రభాకర్,తదితరులు ఉన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :