ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : గోదావరి గోస పేరుతో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ నెల 17 వ తేదీన పాదయాత్రను చేపట్టారు. ప్రస్తుతం ఈ పాదయాత్ర జనగామ జిల్లా కడకండ్ల నుండి ప్రారంభం అయింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం ౩ గంటల వరకు ఈ పాదయాత్ర పూర్తి చేసుకొని కేసీఆర్ ను కలవనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు నీళ్లు లేకుండా చేస్తుందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యలతోనే మేడిగడ్డకు మరమ్మతులు చేయించకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని చందర్ పాదయాత్రను చేపట్టారు.
Admin
Aakanksha News