ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెనుగొండ సతీష్ : అక్రమంగా తరలిస్తున్న టేకుదొంగలను పట్టుకున్నట్లు తిర్యాని ఇంచార్జీ రేంజ్ అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం తెల్లవారుజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో తమ సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహిస్తుండగా తిర్యానీ నుండి 3 ఇంక్లైన్ వైపు వెళ్తున్న టాటా ఇండిగో Apo 9BA1524 నెంబర్ గల కారు డ్రైవర్ దిగి పారిపోగా ... అందులో 15 టేకు దొంగలు ఉండడంతో కారును టేకుదొంగలను రేంజ్కి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా టేకు దుంగల విలువ రూపాయలు 63000 ఉంటుందన్నారు. ఈ గస్తీలో ఎఫ్ ఎస్ ఓ లు రవికుమార్ భీమ్లా నాయక్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
Aakanksha News