Thursday, 30 July 2026 01:12:03 PM

మంత్రి కోమటరెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి...

Date : 23 January 2024 10:19 AM Views : 606

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం ఆయన స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కలుసుకొని కాసేపు మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ అంశాలు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన తీరు గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ తగిన గుర్తింపు ఇస్తారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వానికి, మంత్రికి.. ప్రతాప్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :