ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అతి వేగం ఓ యువకుడి ప్రాణం తీసింది.. హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టమైసమ్మ దేవాలయం మలుపు వద్ద విద్యుత్ స్తంభానికి ఢీ కొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు నెల్లూరు జిల్లాకు చెందిన కృష్ణారెడ్డిగా గుర్తించారు. గండి మైసమ్మ వద్ద హాస్టల్లో ఉంటున్నాడు.
Admin
Aakanksha News