Saturday, 13 June 2026 02:31:50 PM

రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి...ఇద్దరికి తీవ్ర గాయాలు

Date : 17 March 2023 03:40 PM Views : 559

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్త తీవ్ర గాయాలైన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.మంథని మండలం బట్టుపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఖానాపూర్ గ్రామానికి చెందిన రాపాక మధుకర్ అతని భార్య సౌజన్య, తమ్ముడు యశ్వంత్ తో కలిసి బైక్ పై భూపాలపల్లికి శుభకార్యానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ వెనుక భాగం ఢీకొనగా మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మధుకర్, యశ్వంతులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారిని మంథని ప్రభుత్వ ఆసుపత్రికి పోలీస్ వాహనంలో తరలించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :