ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / యాదాద్రి భువనగిరి జిల్లా : శరవేగంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడాలని భువనగిరి బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఈరోజు బీబీనగర్ మండలం మక్తానంతరం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ కొత్త ఎంత సమీపంలో ఉన్న భువనగిరి నియోజకవర్గం ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నప్పటికీ కెసిఆర్ ప్రభుత్వ విధానాలు ఎమ్మెల్యే అసమర్ధతో అభివృద్ధి సాధించలేకపోయిందని శరవేగంగా భువనగిరి అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. తనకు శాసనసభ్యుడిగా అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని ప్రతి పల్లె భవిష్యత్ ముఖచిత్రాన్ని మార్చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ మండల బిజెపి బిజెవైఎం మహిళ మోర్చా నాయకురాళ్లు గ్రామ బిజెపి నాయకులు పలువురు పాల్గొన్నారు
Admin
Aakanksha News